దుర్గమ్మ సేవలో స్వాత్మానందేంద్ర సరస్వతి

ABN , First Publish Date - 2021-10-30T05:29:01+05:30 IST

దుర్గమ్మ సేవలో స్వాత్మానందేంద్ర సరస్వతి

దుర్గమ్మ సేవలో స్వాత్మానందేంద్ర సరస్వతి
ఆగ్మెంటెడ్‌ రియాలిటీ చిత్రాలను ప్రారంభిస్తున్న స్వామి

విజయవాడ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిస్వామి శుక్రవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ జి.వాణీమోహన్‌, దుర్గగుడి ఈవో భ్రమరాంబ, పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు, వైదిక కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వామికి స్వాగతం పలికారు. స్వామీజీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. అనంతరం ఘాట్‌రోడ్డులో దుర్గమ్మ చరిత్రను వివరించే ఆగ్మెంటెడ్‌ రియాలిటీ చిత్రాలను స్వాత్మానందేంద్ర స్వామి ప్రారంభించారు. 

Updated Date - 2021-10-30T05:29:01+05:30 IST