త్వరలో సంస్కార కేంద్రాల ఏర్పాటు : సచ్చిదానంద
ABN , First Publish Date - 2021-07-23T07:02:00+05:30 IST
వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయాల్లో త్వరలో సంస్కార కేంద్రాలు ఏర్పాటు చేసి దైవభక్తి పెంపొందేలా పిల్లలకు శిక్షణ ఇస్తామని అఖిల విశ్వ వాసవీ కన్యకాపరమేశ్వరి పీఠాధిపతి సద్గురు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ పేర్కొన్నారు.
గుడివాడ టౌన్ : వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయాల్లో త్వరలో సంస్కార కేంద్రాలు ఏర్పాటు చేసి దైవభక్తి పెంపొందేలా పిల్లలకు శిక్షణ ఇస్తామని అఖిల విశ్వ వాసవీ కన్యకాపరమేశ్వరి పీఠాధిపతి సద్గురు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ పేర్కొన్నారు. బెంగుళూరు నుంచి గుడివాడ విచ్చేసిన ఆయన గురువారం ప్రణవాశ్రమాన్ని సందర్శించారు. ప్రణవాశ్రమ పీఠాధిపతి స్థైర్యానంద సరస్వతితో కలిసి ఆశ్రమంలో శంకరాచార్యులు, ప్రణవానందస్వామి, నిర్వికల్పానంద స్వామి విగ్రహాలకు అభిషేకం చేశారు. అనంతం శ్రీవాసవీ న్యకాపరమేశ్వరి దేవస్థానంలో పూజలు చేశారు. ఆయనకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నూతనంగా నిర్మించిన వాసవీ కల్యాణ మందిరాన్ని ప్రారంభించారు. ఆలయ చైర్మన్ జవ్వాజి గంగరాజు, కొనకళ్ల సీతయ్య, ఆర్యవైశ్య ప్రముఖులు, ప్రణవాశ్రమ మేనేజర్ రామదేని వేణు పాల్గొన్నారు.