దేవినేని అరెస్టును నిరసిస్తూ గాంధీ విగ్రహానికి వినతి
ABN , First Publish Date - 2021-07-31T06:03:21+05:30 IST
దేవినేని అరెస్టును నిరసిస్తూ గాంధీ విగ్రహానికి వినతి
మైలవరం, జూలై 30: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై అక్రమ కేసులు, అరెస్టును నిరసిస్తూ టీడీపీ మండల నేతలు శుక్రవారం నూజివీడు రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం జైలులో ఉన్న ఉమాకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు తాతా పోతురాజు, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లెల రాధాకృష్ణ, సెక్రటరీ దూరు బాలాకృష్ణ, సుభాని, వార్డు మెంబర్ దుర్గారావు, మద్దినేని శ్రీను, బుడిపూటి వెంకట్రావు, లంక లితీష్, చారుగుండ్ల ప్రసాద్, కరీందాదా, రోశయ్య, జానీ, జల్లి కృష్ణ, ఉప్పు రాజగోపాల్, రమణారెడ్డి పాల్గొన్నారు.