తెలంగాణ కంటే ఎక్కువ పీఆర్సీ: జాక్టోతో సీఎం
ABN , First Publish Date - 2021-09-03T06:19:53+05:30 IST
తెలంగాణ కంటే ఎక్కువ పీఆర్సీ: జాక్టోతో సీఎం

అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యోగుల కంటే ఎక్కువ పీఆర్సీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ సుముఖత వ్యక్తం చేశారని జాక్టో ఏపీ చైర్మన్ మిట్టా కృష్ణయ్య తెలిపారు. గురువారం ఇడుపులపాయలో సీఎంను కలిసి ఉపాధ్యాయ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు చేయాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ కంటే ఎక్కువ పీఆర్సీ ఇవ్వాలని అడగ్గా, సీఎం సుముఖత వ్యక్తం చేశారని కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు.