ప్రకాశం బ్యారేజీకి వరద...తెప్పోత్సవానికి లభించని అనుమతి
ABN , First Publish Date - 2021-10-14T15:10:28+05:30 IST
శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. రేపు కూడా వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అమరావతి: శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. రేపు కూడా వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో రేపు నిర్వహించే తెప్పోత్సవం నిర్వహణపై ఇరిగేషన్ అధికారులు ఇంకా అనుమతులు ఇవ్వని పరిస్థితి ఉంది. వరద ఉధృతి పూర్తిగా తగ్గుముఖం పడితేనే అనుమతులు ఇచ్చే అవకాశం ఉంటుందని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. గత ఏడాది ఏ విధంగా దుర్గా ఘాట్కె పరిమితం చేశారో అదే విధంగా ఈ ఏడాది కూడా తెప్పోత్సవం దుర్గా ఘాట్కె పరిమితం చేసే అవకాశం ఉంది.