పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2021-08-27T06:05:53+05:30 IST
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ, ఉద్యాన, వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని పాలిటెక్నిక్ డిప్లమో కోర్సులకు దరఖాస్తులు ఈనెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సైంటిస్టు గిరిజారాణి తెలిపారు.
![పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 26 : ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ, ఉద్యాన, వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని పాలిటెక్నిక్ డిప్లమో కోర్సులకు దరఖాస్తులు ఈనెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సైంటిస్టు గిరిజారాణి తెలిపారు. ఈ కోర్సులో ప్రవేశించేందుకు 10వ తరగతి ఉత్తీర్ణులయి ఉండాలని, వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, పశుపోషణ, మత్స్యశాస్త్ర పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశించేందుకు అవకాశం ఉందన్నారు.