వివేకా హత్య వెనుక ఉన్న ముఖ్య వ్యక్తి ఆయనే..: పట్టాభి
ABN , First Publish Date - 2021-11-16T16:28:39+05:30 IST
వివేకా హత్య కేసులో దస్తగిరి వాంగ్మూలంలో కీలక విషయాలు బయటకొచ్చాయని టీడీపీ నేత పట్టాభి అన్నారు.
అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలంలో కీలక విషయాలు బయటకొచ్చాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరాం అన్నారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య వెనుక ఉన్న ముఖ్య వ్యక్తి డి.శంకర్రెడ్డి అని పేర్కొన్నారు. హత్య తర్వాత దస్తగిరి.. రాజారెడ్డి ఆస్పత్రికి ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. నిందితులందరిని ముందుండి నడిపించింది డి.శంకర్రెడ్డేనని అన్నారు. హత్య తర్వాత వివేకా ఇంటికి ముందు చేరుకున్నది.. శంకర్రెడ్డి, అవినాష్రెడ్డిలేనని, వైఎస్ కుటుంబానికి అవినాష్రెడ్డి అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు. వివేకా హత్యకు సంబంధించిన ఆధారాలను తుడిచిపెట్టింది సీఎం జగన్ సన్నిహితులేనని పట్టాభి విమర్శించారు. కాగా వివేకా హత్య మార్చి 15, 2019న జరిగిన విషయం తెలిసిందే.