శివాలయానికి నాగాభరణం బహూకరణ

ABN , First Publish Date - 2021-04-17T05:35:30+05:30 IST

శివాలయానికి నాగాభరణం బహూకరణ

శివాలయానికి నాగాభరణం బహూకరణ
బహూకరించిన నాగాభరణం

 హనుమాన్‌ జంక్షన్‌, ఏప్రిల్‌ 16 : కానుమోలు సోమేశ్వరస్వామి ఆలయ శివలింగానికి గ్రామానికి చెందిన ఎన్నారై లు తిరుమల సోమశేఖర్‌బాబు, సుధా రాణి దంపతులు రూ.లక్ష విలువ చేసే వెండి నాగాభరణాన్ని బహూకరించారు. శుక్రవారం ఎన్నారై దంప తులు తరఫున వారి సమీప బంధువులు తిరుమల రాజేష్‌, వాడవల్లి రామ్మోహనరావు ఆల యానికి నాగాభరణాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శాస్ర్తోకంగా పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్ధప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎనికేపల్లి శ్రీనివాసరావు, గ్రామ ప్రముఖులు చిన్నాల సత్యగణేష్‌, గరికపాటి ఉమా, కొండపల్లి హరిబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T05:35:30+05:30 IST