విశాఖ భూ కుంభకోణంపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి: MP raghurama
ABN , First Publish Date - 2021-07-22T16:47:17+05:30 IST
విశాఖ భూ కుంభకోణంపై ఏపీ సీఎం జగన్రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. విశాఖ భూ
న్యూఢిల్లీ: విశాఖ భూ కుంభకోణంపై ఏపీ సీఎం జగన్రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. విశాఖ భూ కుంభకోణంపై సిట్ నివేదిక సమర్పించిందని... సిట్ నివేదికలోని నిందితులపై ఇప్పటికి చర్యలు తీసుకోలేదని అన్నారు. సిట్ నివేదికలో పేర్లు ఉన్నవారితో...మన నేతలు సెటిల్మెంట్లు చేసుకున్నారని ఆరోపణలున్నాయని తెలిపారు. వివాదాస్పద భూముల్లో మననేతలు పెద్దవాటా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నట్లు చెప్పారు. విజయసాయిరెడ్డికి చెందిన ప్రగతి భారతీ ట్రస్టు లావాదేవీలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ భూ కుంభకోణంపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలన్నారు. నిందితులకు శిక్షలు పడేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు.