కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్కు ఎంపీ రఘురామ లేఖ
ABN , First Publish Date - 2021-08-31T18:55:23+05:30 IST
కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు.
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఏపీలో ఫైబర్ నెట్ సంస్థ అక్రమంగా, అనధికారికంగా ఎంఎస్ఓ లైసెన్స్ ఉపయోగిస్తోందని తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ చర్యలు బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997కు విరుద్ధమన్నారు. బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997 ప్రకారం ప్రభుత్వ సంస్థలు, ఎంఎస్ఓ లైసెన్స్ పొందలేవని చెప్పారు. ఏపీ ఫైబర్నెట్ను అనర్హత జాబితాలో చేర్చాలని కోరారు. తక్షణమే చర్యలు తీసుకొని అక్రమ లైసెన్స్ను రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖలో పేర్కొన్నారు.