భక్తిశ్రద్ధలతో జ్యోతి దర్శనం
ABN , First Publish Date - 2021-01-16T05:59:12+05:30 IST
భక్తిశ్రద్ధలతో జ్యోతి దర్శనం
గొల్లపూడి, జనవరి 15 : అయ్యప్పస్వామి దేవస్ధానంలో గురువారం సాయంత్రం అయ్యప్ప జ్యోతి దర్శనం నిర్వహించినట్టు ట్రస్టు సభ్యులు గెల్లి మోహరావు, లోక్నాథ్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జ్యోతి దర్శ నాన్ని తిలకించారని తెలిపారు. అనంతరం కేరళ నృత్యాలు, ద్వాదశ ప్రదక్షణాలు నిర్వహిం చారని, రెండు వేల మంది ఈ దర్శన కార్య క్రమాన్ని వీక్షించారని తెలిపారు.
ఫ పటమట : అయ్యప్పనగర్ కాలనీలో అయ్యప్పస్వామి మకర జ్యోతి దర్శనాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యం లో స్వామి మాలాధారులు చెన్నుపాటి భాస్కరరావు రోడ్డులో గణపతి హోమం, స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేసి కాలనీ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. గురుస్వామి శాయిన బుజ్జి, డోకిపర్తి ఉమా, యుగంధర్, మొగిలి లక్ష్మీనారాయణ, గొట్టిముక్కల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఫహనుమాన్జంక్షన్ రూరల్ : పెరికీడు అయ్యప్పస్వామి దేవాలయంలో మకర జ్యోతి పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. నూలు నరసిం హారావు ఆధ్వర్యంలో గురువారం రాత్రి జరిగిన కలశపూజలో రాష్ట్ర పొలిటికల్ అడ్వ యిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, మాజీ జడ్పీటీసీ సుంకర బోసు, నండూరి సత్య వేంకటేశ్వరశర్మ, అప్పన కనకదుర్గాప్రసాద్ పాల్గొన్నారు.