వ్యవసాయ కూలీలకు భరోసా కల్పించాలి

ABN , First Publish Date - 2021-10-21T06:31:08+05:30 IST

వ్యవసాయ కూలీలకు భరోసా కల్పించాలి

వ్యవసాయ కూలీలకు భరోసా కల్పించాలి
ఉపాధి హామీ పనులపై ప్రజావేదిక నిర్వహిస్తున్న అధికారులు

హనుమాన్‌జంక్షన్‌, అక్టోబరు 20 : క్షేత్రస్థాయిలో వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీపథకం ద్వారా  లబ్ధిపొందే విషయంలో ఎటువంటి అవకతవకలకు చోటులేకుండా భరోసా కల్పించే విధంగా  ఫీల్టు అసిస్టెంట్లు జాగ్రత్తలు వహించాలని  డ్వామా పీడీ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం  రాత్రి బాపులపాడు మండల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం 2019-20, 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూ.10కోట్లు  ఉపాధి పనులపై  ఈనెల 5 వ తేదీ నుంచి 13వ తేదీ వరకు గ్రామాల్లో  సోషల్‌ ఆడిట్‌  నిర్వహించారు.  దాదాపు  2లక్షల పని దినాలపై నిర్వహించిన సోషల్‌ ఆడిట్‌పై  పీడీ  ప్రజావేదిక జరిపారు.  ఈ సందర్భంగా పీడీ  మాట్లాడుతూ  కేంద్ర ప్రభు త్వం మంచి లక్ష్యంతో  ఈ పథకాన్ని అమలు చేస్తోం దని  ప్రతీ వ్యవసాయ కూలీ  పనిదినాలు  నష్టపోకుండా  చర్యలు తీసుకో వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వై.నగే్‌ష్‌, జడ్పీటీసీ సభ్యురాలు కె. గంగా భవానీ,   అడిషనల్‌ పీడీ  పి.జనార్దనరావు, డీవీవో రామాంజనేయులు, అంబుడ్స్‌ మెన్‌ బాపిరాజు, సాట్‌  డైరక్టర్‌  ఎం.జగదీష్‌ కుమార్‌, ఎంపీడీవో పీఎ్‌సఆర్‌. ప్రసాద్‌,    ఏవోడీ  వెంకటరమణ, ఏపీవో టీ. వినీలా ఎఆర్పీ కనకారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T06:31:08+05:30 IST