వైసీపీ అవినీతి బాగోతం బయట పెట్టిన వైసీపీ నేత..
ABN , First Publish Date - 2021-12-31T15:39:17+05:30 IST
ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలం కావాలంటే పేదలు ముడుపులు ముట్టజెప్పాల్సిందే అనే ఆరోపణలకు నిదర్శనంగా నిలిచే...

కృష్ణా జిల్లా: ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలం కావాలంటే పేదలు ముడుపులు ముట్టజెప్పాల్సిందే అనే ఆరోపణలకు నిదర్శనంగా నిలిచే ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో వెలుగుచూసింది. ఆ మండల వైసీపీ అధ్యక్షుడే అక్కడి అవినీతి భాగోతాన్ని బయటపెట్టారు. ఈ వ్యవహారం అక్కడ హాట్ టాపిక్గా మారింది.
సంక్షేమ పథకాలు పేదలకు అందాలంటే ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వాల్సి వస్తుందంటూ కృష్ణాజిల్లా, మోపిదేవి మండల వైసీపీ అధ్యక్షుడు మోహన శివరాజయ్య మీడియా ముందు వాపోయారు. తమ గ్రామానికి చెందిన రాజులపాటి నాగమల్లేశ్వరరావుకు అన్ని అర్హతలు ఉన్నా ఇంటి పట్టా ఇవ్వకుండా.. ఇప్పటికే ఇల్లున్న అతని సోదరుడికి పట్టా ఇచ్చారని ఆయన తెలిపారు. ఇదేంటని అడిగితే రూ. 20వేలు ఇస్తేనే పట్టా ఇస్తామంటున్నారని ఆయన ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయం అవినీతి మయంగా మారిపోయిందని, తమ గ్రామానికి చెందిన పలువురు నుంచి తహసీల్దార్ లంచం తీసుకున్నారని శివరాజయ్య ఆరోపించారు.