అందుకే కొండపల్లి ఎన్నికను వాయిదా వేశాం: ఎన్నికల అధికారి
ABN , First Publish Date - 2021-11-23T19:48:02+05:30 IST
వైసీపీ కౌన్సిలర్లు విధ్వంసం సృష్టించడంతో కొండపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక ఈరోజు కూడా వాయిదా పడింది.
విజయవాడ: వైసీపీ కౌన్సిలర్లు విధ్వంసం సృష్టించడంతో కొండపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక ఈరోజు కూడా వాయిదా పడింది. ఎన్నికల అధికారి సునీల్ కుమార్ రెడ్డి కొండపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోగా...టీడీపీ సభ్యులు కార్యాలయం లోపలే ఉన్నారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ...ఈరోజు కూడా ఎన్నికకు అవకాశం లేకుండా పోయిందన్నారు. సర్ది చెప్పినా సభ్యలు తగ్గలేదని తెలిపారు. అందుకే ఎన్నికను వాయిదా వేసినట్లు చెప్పారు. కాగా... లోపలే ఉన్న టీడీపీ సభ్యుల గురించి ఎన్నికల అధికారిని అడుగగా... స్పందించకుండా వెళ్లిపోయారు.