ఓటమి భయంతోనే ఎన్నికలకు వెనకడుగు
ABN , First Publish Date - 2021-01-13T06:51:28+05:30 IST
ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండటం వల్లే స్థానిక ఎన్నికలకు సీఎం జగన్మోహనరెడ్డి వెనుకంజ వేస్తున్నారని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు విమర్శించారు.
![ఓటమి భయంతోనే ఎన్నికలకు వెనకడుగు](https://media.andhrajyothy.com/appimg/galleries/2021011301174797/01132021012108n38.jpg)
మచిలీపట్నం టౌన్, జనవరి 12 : ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండటం వల్లే స్థానిక ఎన్నికలకు సీఎం జగన్మోహనరెడ్డి వెనుకంజ వేస్తున్నారని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు విమర్శించారు. మచిలీపట్నంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైసీపీకి డిపాజిట్లు రావనే భయంతోనే ఎన్నికలు వాయిదా వేస్తున్నారన్నారు. నెల్లూరులో జరిగిన సీఎం అమ్మఒడి సభకు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇంటి పట్టాల పంపిణీకి వేలాది మందిని తరలించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు వ్యతిరేక అక్రమ జీవోలను బుధ వారం భోగిమంటల్లో దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు కొనకళ్ల జగన్నాథరావు, ఫణికుమార్, నరేష్ పాల్గొన్నారు.