హోంఐసోలేషన్ బాధితులకు మెడికల్ కిట్ల అందజేత
ABN , First Publish Date - 2021-05-17T06:25:56+05:30 IST
కరోనా బారినపడి హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న వారికి వైసీపీ నాయకులు ఆదివారం మెడికల్ కిట్లు అందజేశారు.
ఉయ్యూరు, మే 16 : కరోనా బారినపడి హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న వారికి వైసీపీ నాయకులు ఆదివారం మెడికల్ కిట్లు అందజేశారు. ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి క మిటీ చైర్మన్ జంపాన కొండలరావు మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చి ఇంటి వద్దే చికిత్స పొందుతున్న నియోజకర్గ ప్రజలను ఆదుకునేందుకు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి పంపిన మెడికల్ కిట్లను కరోనా బాధితులకు అందజేస్తున్నామన్నారు. ఉయ్యూరు వైస్ చైర్మన్ సోలె సురే్షబాబు, పార్టీ నాయకులు బాబ్జి, సద్దాం తదితరులు సేవలందించారు.