రూ. కోటితో ఎనికేపాడు అభివృద్ధి
ABN , First Publish Date - 2021-06-12T06:18:38+05:30 IST
రూ. కోటితో ఎనికేపాడు అభివృద్ధి
ఫ డ్రెయినేజీ వ్యవస్థ పటిష్టతకు నిర్ణయం
ఫపంచాయతీ పాలకవర్గ సమావేశం తీర్మానం
విజయవాడ రూరల్, జూన్ 11 : ఎనికేపాడులో రూ.కోటితో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సర్పంచ్ రాచమళ్ల పూర్ణచంద్రరావు అధ్యక్షతన పంచాయతీ పాలకవర్గ సమావేశం శుక్రవారం జరిగింది. గ్రామంలోని అన్ని ప్రాంతాల్లోనూ డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచేందుకు సమావేశం నిర్ణయించింది. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఇన్చార్జి కార్యదర్శి కృపాకుమార్ తొలుత అజెండాను ప్రవేశపెట్టారు. రూ.కోటితో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రధాన రహదారులతోపాటు రైల్వేకట్టరోడ్డు, వీకేఆర్ కాలనీ, శివాలయం, పల్లాలు ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచాలని తీర్మానించారు. అలాగే గ్రామంలోని అంతర్గత రోడ్ల నిర్మాణం, పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న కుంట పోరంబోకు స్థలాన్ని సర్వే చేయాలని, అనంతరం పూడికతీయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ టంకసాల శివప్రసాద్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.