పంటను ఈ- క్రాప్లో నమోదు చేయించుకోవాలి
ABN , First Publish Date - 2021-08-01T06:10:01+05:30 IST
పంటను ఈ- క్రాప్లో నమోదు చేయించుకోవాలి
పెదఓగిరాల(ఉయ్యూరు), జూలై 31 : రైతులు పండించే పంటపే రైతు భరోసా కేంద్రాల వద్ద తప్పనిసరిగా ఈ క్రాప్లో నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పి.మోహన్రావు అన్నారు. పెదఓగిరాలో పంట నమోదు ప్రక్రియను శనివారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరైతు తాను పండిస్తున్న పంట వివరాలు గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలలో నమోదుకు రిజిష్ట్రేషన్ చేయించుకుంటే తరువాత వ్యవసాయ, ఉద్యానవ న శాఖ సహాయకులు పొలానికి వచ్చి ఫోటోతీసి నమోదు చేస్తారని వివరించారు. పంట నమోదు చేసుకున్న రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే అఽన్ని పథకాలు వర్తిస్తాయని, చేయించుకోని వారికి ఇన్సూరెన్స్, పంటరుణం, మద్దతు ధర వర్తించవన్నారు. మండల వ్యవసాయ అధికారి జీవీ శివప్రసాద్, ఏఈవో సునీల్ గవాస్కర్, పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.