అశాస్త్రీయ శస్త్రచికిత్సలను అనుమతించొద్దు
ABN , First Publish Date - 2021-02-08T06:40:18+05:30 IST
ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేయడాన్ని అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడమేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మహిళా విభాగం చైర్పర్సన్ డాక్టర్ పద్మావతీదేవి అన్నారు.
![అశాస్త్రీయ శస్త్రచికిత్సలను అనుమతించొద్దు](https://media.andhrajyothy.com/appimg/galleries/2021020801080532/02082021010951n2.jpg)
మహిళా డాక్టర్ల ఆధ్వర్యంలో రిలే దీక్షలు
గవర్నర్పేట, ఫిబ్రవరి 7: ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేయడాన్ని అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడమేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మహిళా విభాగం చైర్పర్సన్ డాక్టర్ పద్మావతీదేవి అన్నారు. మిక్సోపతి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఐఎంఏ ఆధ్వర్యంలో చల్లపల్లి బంగ్లా సమీపంలోని ఐఎంఏ హాలు ప్రాంగణంలో డాక్టర్లు చేస్తున్న రిలే దీక్షల్లో భాగంగా ఆదివారం మహిళా డాక్టర్లు పాల్గొన్నారు. శిబిరాన్ని ఐఎంఏ నగర అధ్యక్షుడు మధుసూధనశర్మ ప్రారంభించారు. నగర మహిళా విభాగం చైర్పర్సన్ డాక్టర్ దుర్గావాణి తదితరులు పాల్గొన్నారు.