డ్రగ్స్ వ్యవహారంపై మళ్లీ జాతీయస్థాయిలో ఏపీ పేరు: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2021-10-24T19:22:45+05:30 IST
డ్రగ్స్ వ్యవహారంపై మళ్లీ జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు వినిపిస్తోందని దేవినేని ఉమ ట్విట్టర్లో పేర్కొన్నారు.
అమరావతి: డ్రగ్స్ వ్యవహారంపై మళ్లీ జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు వినిపిస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఏపీ నుంచి విదేశాలకు సరఫరా చేస్తూ.. కర్నాటకలో కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయన్నారు. దీనిని ప్రశ్నించిన టీడీపీ నేతలపై, కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన ఏపీ డ్రగ్స్ వ్యవహారంపై.. ప్రజలకు జగన్రెడ్డి సమాధానం చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.