స్టీల్‌ప్లాంట్‌పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి... లేదంటే: ముప్పాళ్ల

ABN , First Publish Date - 2021-02-06T18:56:05+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్...గుజరాత్ రాష్ట్ర బడ్జెట్‌లా ఉందని,

స్టీల్‌ప్లాంట్‌పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి... లేదంటే: ముప్పాళ్ల

కృష్ణా:  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వెనక్కు తీసుకోవాలని..లేదా ప్రజా ఉద్యమం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. శనివారం తిరువూరు నియోజకవర్గ పరిధిలోని అగ్రిగోల్డ్ బాధితుల, ఏజెంట్లు సమావేశంలో ముప్పాళ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్...గుజరాత్ రాష్ట్ర బడ్జెట్‌లా ఉందని, రాష్ట్రానికి కేటాయింపుల్లో మొండి చేయి చూపించారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇవ్వవలసిన బకాయిలు తక్షణం విడుదల చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వ విభజన హామీలు అన్నీ అమలు చేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-02-06T18:56:05+05:30 IST