ఆర్నెల్లు కాదు.. ఏడాది బహిష్కరణ!
ABN , First Publish Date - 2021-10-27T06:06:56+05:30 IST
2019 మార్చి 29.. నగర చరిత్రలో మచ్చపడిన రోజు. పట్టపగలు రెండు గ్యాంగ్లు మారణాయుధాలతో జ నావాసాల మధ్య పరస్పరం దాడులు చేసుకున్నాయి.
అందరి ‘సోషల్’ అకౌంట్ల పైనా నిఽఘా
పండు, సందీప్ గ్యాంగ్లకు సీపీ హెచ్చరిక
57 మందిపై బైండోవర్ కేసులు
విజయవాడ, అక్టోబర్ 26 (ఆంధ్రజ్యోతి) : 2019 మార్చి 29.. నగర చరిత్రలో మచ్చపడిన రోజు. పట్టపగలు రెండు గ్యాంగ్లు మారణాయుధాలతో జ నావాసాల మధ్య పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో తోట సందీ్పకుమార్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అతని మరణానికి కారణ మైన కోడూరి మణికంఠ అలియాస్ కేటీఎం పండు గ్యాంగ్పై సందీప్ సోదరుడు తోట జగదీష్ కుమార్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలతో పోస్టింగ్లు చేసుకుంటున్నారు. పండు 32 మందితో, జగదీష్ కుమార్ 35 మందితో గ్యాంగ్లను నడుపుతున్నారు. ప్రతీకారాలు తీర్చుకు నేందుకు సుపారీ గ్యాంగ్ల వద్దకు వెళ్తున్నట్టు నిఘా వర్గాల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు రెండు వర్గాలకు చెందిన 67మందిపై బైండోవర్ కేసు లు నమోదు చేశారు. వారికి సీపీ కార్యాలయంలో మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. సీపీ శ్రీనివాసులు వారికి హెచ్చరికలు చేశారు. గ్యాంగ్ల్లో ఉన్నవా రికి గంజాయి సరఫరాతోనూ సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా అకౌంట్లపైనా దృష్టి పెట్టామన్నారు. ఈసారి నగర బహిష్కరణ ఆరు నెలలు కాదని, ఏడాదిపాటు విధిస్తానని స్పష్టం చేశారు. ఎవరెవరు గంజాయి తీసుకుంటున్నారో తెలుసుకున్నారు. ఒకేసారి రెండు గ్రూపులు కమిషనరేట్కు రావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక గ్రూపు వెళ్లాక మరో గ్రూపును ఆటోల్లో పంపారు
అనంత్కుమార్పై నగర బహిష్కరణ?
ఇంజనీరింగ్ చేసి పండు గ్యాంగ్లో తిరుగుతూ గంజాయి తాగుతున్న అనంత్కుమార్పై నగర బహిష్కరణకు పోలీసులు నిర్ణయించారు. అతనిపై పెనమలూరు పోలీ్సస్టేషన్లో పలు కేసులున్నాయి. కొద్దిరోజుల క్రితమే జైలు నుంచి బయటకొచ్చాడు. అయినా పండు బ్యాచ్తో జతకట్టాడు. సీపీ ప్రశ్నించినప్పుడు తాను బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నానని చె అతడిపై నగర బహిష్కరణ విధినంచాలని భావిస్తున్నారు. పెనమలూరు ఇన్స్పెక్టర్ సత్యనారాయణకు సీపీ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. పండు సోషల్ మీడియాలో వదులుతున్న వీడియోలను అనంత్ ఎడిటింగ్ చేస్తున్నాడని సమాచారం.