ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2021-10-20T07:04:22+05:30 IST
జిల్లాలో మంగళవారం మరో ఇద్దరు కరోనా బాధితులు మరణించారు.

కొత్తగా 81 మందికి కరోనా
విజయవాడ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మంగళవారం మరో ఇద్దరు కరోనా బాధితులు మరణించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 81 మందికి వైరస్ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 1,18,646కు చేరుకున్నాయి. మరణాల సంఖ్య అధికారికంగా 1,414కు చేరింది. జిల్లావ్యాప్తంగా కరోనా బారినపడినవారిలో ఇప్పటి వరకు 1,16,486 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇంకా 746 మంది బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.