కొత్తగా 11 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-03-01T06:45:55+05:30 IST
జిల్లాలో ఆదివారం కొత్తగా 11 మందికి కరోనా వైరస్ సోకింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
జిల్లాలో ఆదివారం కొత్తగా 11 మందికి కరోనా వైరస్ సోకింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48,920కి చేరింది. మరణాల సంఖ్య అధికారికంగా 681 వద్ద నిలకడగానే ఉంది. ఇంకా 96 మంది పాజిటివ్ బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.