కొత్తగా 35 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-01-20T07:04:36+05:30 IST
జిల్లాలో మంగళవారం కొత్తగా 35 మందికి కరోనా వైరస్ సోకింది.

40 మంది డిశ్చార్జి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో మంగళవారం కొత్తగా 35 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48,376కి పెరిగింది. మరణాల సంఖ్య 676 దగ్గర నిలకడగానే ఉంది. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 40 మంది గడిచిన 24 గంటల్లో వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 266 మంది పాజిటివ్ బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.