కొత్తగా 26 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-01-18T06:29:36+05:30 IST
కొత్తగా 26 మందికి కరోనా
18 మంది డిశ్చార్జి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
జిల్లాలో ఆదివారం కొత్తగా 26 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48,335కి పెరిగింది. కరోనా మరణాల సంఖ్య 676 దగ్గర నిలకడగా ఉంది. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 18 మంది గడిచిన 24 గంటల్లో వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 300 మంది పాజిటివ్ బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.