కృష్ణాలో కొత్తగా 8 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-01-12T06:51:02+05:30 IST

జిల్లాలో సోమవారం కరోనా కేసుల సంఖ్య తగ్గింది.

కృష్ణాలో కొత్తగా 8 మందికి కరోనా

మరో బాధితుడు మృతి 

21 మంది డిశ్చార్జి 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో సోమవారం కరోనా కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా ఎనిమిది మందికి వైరస్‌ సోకింది. మరో పాజిటివ్‌ బాధితుడు చికిత్స పొందుతూ మరణించారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 48,191కి పెరిగింది. అధికారికంగా కరోనా మరణాల సంఖ్య 672కు చేరుకుంది. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 21 మంది గడచిన 24 గంటల్లో వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 324 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-01-12T06:51:02+05:30 IST