టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ దాడులను ఖండిస్తున్నాం: sunkara

ABN , First Publish Date - 2021-10-20T14:15:35+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాలయం, టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు.

టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ దాడులను ఖండిస్తున్నాం: sunkara

విజయవాడ: టీడీపీ కేంద్ర కార్యాలయం, టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి జగన్ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యాలయాలు, ఇళ్లపై దాడులు సరికాదన్నారు. తమకు ఎదురు చెప్పేవారు ఉండకూడదని ముఖ్యమంత్రి దాడులకు సైతం వెనుకాడటం లేదని విమర్శించారు. రాజకీయ పార్టీలు అన్న తరువాత ఎవరి పార్టీ సిద్దాంతాలు వారికి ఉంటాయని సుంకర తెలిపారు.


ముఖ్యమంత్రి జగన్ పార్టీ సిద్దాంతం రౌడీయిజమని వ్యాఖ్యానించారు. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో టీడీపీ పార్టీ ఆఫీసులపై దాడి అంటే.. ఉద్దేశపూర్వకంగా చేసింది కాక మరేంటి ? అని ప్రశ్నించారు. ఏపీ పోలీస్ శాఖ వైసీపీ పోలీస్ శాఖగా మారిందన్నారు. అధికార పార్టీ అరాచకాలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. జరిగిన తప్పును తప్పు అని చెబుతున్న తనపై కూడా రేపు వైసీపీ కార్యకర్తలు దాడి చేసినా ఆశ్చర్యం లేదన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇంటిపై దాడికి దిగిన నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-10-20T14:15:35+05:30 IST