4 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు: కలెక్టర్
ABN , First Publish Date - 2021-08-25T06:46:10+05:30 IST
4 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు: కలెక్టర్

విజయవాడ సిటీ, ఆగస్టు 24: నగరంలో 4 కేంద్రాల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో (ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్/ ఎకౌంట్స్ ఆఫీసర్స్) ఉద్యోగాల నియామకానికి సెప్టెంబర్ 5న పరీక్షకు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు సెన్సిటివ్ మెటీరియల్ గన్నవరం విమానాశ్రయం నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు విజయవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి చేరవేశారు. వాటిని పరిశీలించి స్ట్రాంగ్రూమ్లో భద్రపరచే ప్రక్రియను కలెక్టర్ మంగళవారం పర్యవేక్షించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ పరిపాలన అధికారి వి. శ్రీనివాస్, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్యామ్నాథ్ కలెక్టర్ వెంట ఉన్నారు.