సంప్రదాయాలను పిల్లలకు నేర్పాలి

ABN , First Publish Date - 2021-03-21T06:20:46+05:30 IST

హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయవలసిన బాధ్యత తల్లి దండ్రులపై ఉందని నూజివీడు లలితా కామేశ్వరీ పీఠాధిపతి ఆదిత్యానంద భారతీస్వామి పేర్కొన్నారు.

సంప్రదాయాలను పిల్లలకు నేర్పాలి

లలితా కామేశ్వరీ పీఠాధిపతి ఆదిత్యానంద భారతీస్వామి

నందిగామ రూరల్‌, మార్చి 20: హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయవలసిన బాధ్యత తల్లి దండ్రులపై ఉందని నూజివీడు లలితా కామేశ్వరీ పీఠాధిపతి ఆదిత్యానంద భారతీస్వామి పేర్కొన్నారు. పట్టణంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న 68వ శ్రీ రామకోటి ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి శనివారం ఆయన ప్రారంభించారు. ఆయనకు ఆలయ అర్చకులు దివి కృష్ణమాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకుడు దివి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో గోదాకృష్ణమూర్తుల దివ్య కళ్యాణోహోత్సవాన్ని వైభవంగా నిర్వ హించారు. పట్టణానికి చెందిన ఊటుకూరు సత్యనారాయణ, నాగలక్ష్మీ దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం సుందరకాండ పారాయణం, లలితా విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. రాత్రికి సీతారామ కల్యాణం హరికఽథా గానం ఆకట్టుకుంది. 


Updated Date - 2021-03-21T06:20:46+05:30 IST