APలో జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ABN , First Publish Date - 2021-09-16T17:12:30+05:30 IST
రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అమరావతి: రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కౌంటింగ్పై సింగిల్ జడ్జి ఇచ్చని తీర్పును హైకోర్టు డివిజనల్ బెంచ్ కొట్టివేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ త్వరలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనుంది. రాష్ట్రంలో 515 జడ్పీటీసీలు, 7,220 ఎంపీటీసీలకు ఈ ఏడాది ఏప్రిల్ 8న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.