తిరుపతి రుయా ఆస్పత్రిపై హైకోర్టులో మరో పిటిషన్

ABN , First Publish Date - 2021-05-20T18:12:23+05:30 IST

తిరుపతి రుయా ఆస్పత్రిపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.

తిరుపతి రుయా ఆస్పత్రిపై హైకోర్టులో మరో పిటిషన్

అమరావతి: తిరుపతి రుయా ఆస్పత్రిపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. టీడీపీ నేత పీఆర్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్‌పై  న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని వాదించారు. కలెక్టర్, డీఎంహెచ్ఓ ఆక్సిజన్ సమయానికి అందలేదని చెప్పారని... ఇది నిర్లక్ష్యమేనని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. బాధ్యులపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ ఘటనలో 36 మంది చనిపోతే ప్రభుత్వం 11 మందేనని చెబుతోందని...న్యాయ విచారణకు ఆదేశించాలని వాదనలు వినిపించారు. కేంద్రం ఇచ్చిన ఐదు ప్లాంట్లను నేటి వరకు నెలకొల్పలేదన్నారు. వాదనలు విన్న కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తిరుపతి ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం కోర్టు ప్రారంభమైన తొలిరోజుకి విచారణ జరుగనుంది.


Updated Date - 2021-05-20T18:12:23+05:30 IST