అమరావతి శిబిరంలో రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారు
ABN , First Publish Date - 2021-10-15T19:42:37+05:30 IST
అమరావతి శిబిరంలో రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారని రైతులు ఏర్పాటు చేశారు.
అమరావతి: మందడం గ్రామం అమరావతి శిబిరంలో రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారిని రైతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అమరావతి ఉద్యమం 668 రోజు కొనసాగుతోందన్నారు. అమరావతిని, అమ్మవారిని వేరుచేయలేరని అన్నారు. అమ్మవారి గుడికి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని, అమ్మవారే తమ శిబిరానికి వచ్చిందన్నారు. రైతులు నిర్వహించే మహా పాదయాత్రను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. న్యాయస్థానం నుంచి తిరుమల శ్రీవారి దేవస్థానం వరకు పాదయాత్ర చేసి తీరుతామని రైతులు స్పష్టం చేశారు.