ఆకాశంలో మబ్బులు - రైతుల గుండెల్లో గుబులు

ABN , First Publish Date - 2021-11-28T06:19:38+05:30 IST

ఆకాశంలో మబ్బులు - రైతుల గుండెల్లో గుబులు

ఆకాశంలో మబ్బులు - రైతుల గుండెల్లో గుబులు
చినఓగిరాల ఆర్‌బీకేలో ధాన్యం తేమ శాతం తెలిపే యంత్రం, పరీక్ష విధానం రైతులకు తెలియచేస్తున్న తహశీల్దార్‌, ఏవో

ఉయ్యూరు, నవంబరు 27 :  వాతావరణ మార్పులతో ఆకాశం లో మబ్బులు రైతుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ఆరుగాలం కష్టప డి పండించిన పంట చేతి కొస్తున్న తరుణంలో అకాల వర్షాలు, వా యుగుండాలు రైతుల కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. వరిపం ట కోతకొచ్చిన సమయంలో నిన్న మొన్నటి వరకు కురిసిన వర్షాలతో కోతలు ఆలస్యం కాగా పంట తరుణం మించి పోయి కంకుల నుంచి ధాన్యంరాలి పోయే పరిస్థితులతో పాటు వాతావరణం పొడిగా ఉన్న నేపథ్యంలో రైతులు కోతలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మరలా వాయుగుండం అన్న వాతావరణ హెచ్చరికలతో శనివారం వాతావ రణ మార్పుతో ఆకాశం మేఘావృతమవ్వడం రైతులను ఆందోళనకు  గురిచేస్తుంది. వరి కోతలు కోసిపొలంలో పనలపై ఉండగా వారితో పాటు కోతలు కోయించేందుకు సిద్ధమైన వారు కూడా  వాయుగండం నుంచి తప్పించు దేవుడా అని  వేడుకుంటున్నారు. 

ఆర్‌బీకేల్లో రైతులకు కనీస మద్దతు ధర

 రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు కనీస మద్ధతు ధర లభిస్తుందని  ఏవో శివప్రసాద్‌, తహసీల్దార్‌ కె.నాగేశ్వరరావు అన్నారు. మండలం లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను  శనివారం సందర్శించారు. టెక్నికల్‌ అసిస్టెంట్లు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. 

బోర్లకింద దాళ్వా సాగు వద్దు 

ప్రస్తుత పరిస్థితుల్లో బోర్లకింద దాళ్వా సాగు ఎట్టిపరిస్థితుల్లో చేయ వద్దని అధికారులు రైతులకు సూచించారు. ప్రత్యమ్నాయంగా అపరాలు, మొక్కజొన్న సాగుచేయాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-11-28T06:19:38+05:30 IST