ఆటో బోల్తా..ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-11-27T06:12:09+05:30 IST
ఆటో బోల్తా..ఒకరి మృతి
14 మందికి గాయాలు
తిరువూరు, నవంబరు 26: పట్టణ శివారు దేవసముద్రం సమీపంలో వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు..పద్నాలుగు మంది గాయపడ్డారు. చింతలపాడు వైపు నుంచి తిరువూరుకు కూలీలతో వస్తున్న ఆటో చెరువు సమీపంలో అదుపు తప్పి బొల్తా కొట్టింది. ఎరుకోపాడుకు చెందిన కొంగల సుబ్బారావు(40)మృతి చెందాడు. ఎస్సై దుర్గాప్రసాద్ గాయపడిన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల్ని టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జి శావల దేవదత్ పరామర్శించారు.