ఇద్దరు మృతి.. 73 మందికి వైరస్
ABN , First Publish Date - 2021-10-07T06:36:58+05:30 IST
ఇద్దరు మృతి.. 73 మందికి వైరస్
![ఇద్దరు మృతి.. 73 మందికి వైరస్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
విజయవాడ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరో ఇద్దరు కరోనా బాధితులు బుధవారం మరణించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 73 మందికి వైరస్ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 1,17,852కు చేరాయి. మరణాలు అధికారికంగా 1,391కు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా కరోనా బారినపడిన వారిలో ఇప్పటి వరకు 1,15,558 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 903 మంది ప్రస్తుతం కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.