11 మందికి కరోనా.. 41 మంది డిశ్చార్జి
ABN , First Publish Date - 2021-02-06T05:59:00+05:30 IST
11 మందికి కరోనా.. 41 మంది డిశ్చార్జి

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో శుక్రవారం కొత్తగా 11 మందికి కరోనా సోకింది. కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో పాజిటివ్ బాధితుడు మరణించాడు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48,743కు పెరిగింది. కరోనా మరణాలు అధికారికంగా 679కు చేరాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 41 మంది బాధితులు కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఇంకా 260 మంది చికిత్స పొందుతున్నారు.