భారీ వర్షాలు: జగన్కు మోదీ ఫోన్
ABN , First Publish Date - 2021-11-20T00:04:57+05:30 IST
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్ చేశారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్ చేశారు. కొనసాగుతున్న సహాయక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అన్ని విధాలుగా సాయమందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కడప జిల్లా రాజంపేట వరదల్లో 12 మంది జల సమాధి అయ్యారు. చిత్తూరు జిల్లాలోనూ భారీగా వానలు కురుస్తున్నాయి. తిరుమల కొండపైన వరద బీభత్సం నెలకొంది. తిరుపతి నగరంలో అనేక కాలనీలు నీట మునిగాయి.