ప్రపంచ దోమల నివారణా దినోత్సవ ర్యాలీ

ABN , First Publish Date - 2021-08-21T04:53:41+05:30 IST

ప్రపం చ దోమల నివారణా దినోత్సవం సంద ర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించా రు.

ప్రపంచ దోమల నివారణా దినోత్సవ ర్యాలీ
పులివెందులలో ర్యాలీ నిర్వహిస్తున్న మున్సిపల్‌, వైద్యశాఖ అధికారులు

పులివెందుల టౌన్‌, ఆగస్టు 20: ప్రపం చ దోమల నివారణా దినోత్సవం సంద ర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించా రు. పులివెందుల మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి సిద్దయ్య, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య, ఆశ కార్యకర్తలు ఫ్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌ కూడలిలో మానవహారం నిర్వహించారు. మున్సిపల్‌, ఆరోగ్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఖాజీపేట, ఆగస్టు 20: ఆడ ఎనాఫిలస్‌ దోమ వలన మలేరియా వ్యాప్తి చెందు తుందని మండల వైద్యాధికారి పి.సెల్వియా సాల్మన్‌ అన్నారు. ప్రపంచ దోమల నివార ణా దినోత్సవం సందర్భంగా ఖాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి ఆమె సూచనలు అందించారు. ఆరోగ్య విస్తరణాధికారి రాఘవయ్య, సూపర్‌వైజర్‌ యోగీశ్వర య్య, కృష్ణప్రియ, షంషాద్‌బేగం, పార్వతి, తదితరులు పాల్గొన్నారు.

దువ్వూరు, ఆగస్టు 20: ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ దోమలపట్ల అప్రమత్తంగా ఉండాలని దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుడు డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ దోమల నివారణా దినోత్సవం సంద ర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారులు శివరామయ్య, వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-08-21T04:53:41+05:30 IST