జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2021-01-13T05:01:10+05:30 IST
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా, జిల్లా ఇన్చార్జిమంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్ హరికిరణ్, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి ఎంపీలు అవినాష్ రెడ్డి, మిఽథున్ రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

కడప(కలెక్టరేట్), జనవరి 12: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా, జిల్లా ఇన్చార్జిమంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్ హరికిరణ్, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి ఎంపీలు అవినాష్ రెడ్డి, మిఽథున్ రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్ని ప్రజలకు సంతృప్తికరంగా అందడంతో నూతన సంవత్సరానికి ముందే జిల్లాలో సంక్రాంతి కళ సంతరించుకుందని వారు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో హాయిగా ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.