వివేకా హత్య కేసు.. మళ్లీ మొదలైన సీబీఐ విచారణ
ABN , First Publish Date - 2021-12-15T20:16:35+05:30 IST
వివేకానందరెడ్డి హత్య కేసు కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ సీబీఐ విచారణ మొదలైంది.
కడప జిల్లా: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ సీబీఐ విచారణ మొదలైంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ కొనసాగుతోంది. సీబీఐ విచారణకు సునీల్ కుమార్ బంధువు భరత్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. గత నెల 21న కొత్త వ్యక్తుల పేర్లను తెరపైకి తెస్తూ.. భరత్ కుమార్ యాదవ్ సీబీఐకు లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భరత్ కుమార్ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.