ట్రాక్టరు ర్యాలీకి యూటీఎఫ్ సంఘీభావం
ABN , First Publish Date - 2021-01-27T05:03:07+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టరు ర్యాలీకి సంఘీభావంగా యూటీఎఫ్ నిరసన దీక్ష చేపట్టారు.
కడప(ఎడ్యుకేషన్), జనవరి 26: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టరు ర్యాలీకి సంఘీభావంగా యూటీఎఫ్ నిరసన దీక్ష చేపట్టారు. కడప నగరం సీఐటీయూ ఆధ్వర్యంలో ట్రాక్టరు ర్యాలీ ఐటీఐ సర్కిల్ నుంచి మొదలై ఆర్అండ్బీ బంగ్లా వరకు నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు రమణ, నరసింహారావు, నాగిరెడ్డి, డేవిడ్, రఫి పలువురు పాల్గొన్నారు.