గుర్తు తెలియని వాహనం ఢీ... ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-02-25T05:14:41+05:30 IST

మండల పరిధిలోని రెడ్డిపల్లె చెరువు కట్టవద్ద కడప-చెన్నై రహదారిలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేష్‌(28) అనే వ్యక్తి మృతి చెందాడు.

గుర్తు తెలియని వాహనం ఢీ... ఒకరి మృతి

పుల్లంపేట, ఫిబ్రవరి 24 : మండల పరిధిలోని రెడ్డిపల్లె చెరువు కట్టవద్ద కడప-చెన్నై రహదారిలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేష్‌(28) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా.. రైల్వేకోడూరుకు చెందిన నరేష్‌ రాజంపేట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో నరేష్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2021-02-25T05:14:41+05:30 IST