రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
ABN , First Publish Date - 2021-03-01T05:10:19+05:30 IST
వారిద్దరూ మంచి స్నేమితులు.. చేసే వృత్తి కార్పెంటర్ అయినా పనిచేస్తూ ఇద్దరు ఎక్కడికెళ్లాలన్నా కలిసి వెళతారు.. అయితే వీరి స్నేహం మృత్యువులో కూడా వీడలేదు. కడప నగరం రామాంజనేయపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
మృత్యువులో కూడా వీడని స్నేహబంధం
కడప(క్రైం), ఫిబ్రవరి 28: వారిద్దరూ మంచి స్నేమితులు.. చేసే వృత్తి కార్పెంటర్ అయినా పనిచేస్తూ ఇద్దరు ఎక్కడికెళ్లాలన్నా కలిసి వెళతారు.. అయితే వీరి స్నేహం మృత్యువులో కూడా వీడలేదు. కడప నగరం రామాంజనేయపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న రిమ్స్ ఎస్ఐ సుధాకర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎస్ఐ వివరాల మేరకు.. కడప నగరం గౌస్నగర్కు చెందిన షేక్ మస్తాన (25), సియోనుపురంకు చెందిన శ్రీకాంత (22) కార్పెంటరు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సొంత పని నిమిత్తం సిద్దవటం రూట్ వెళ్లి తిరిగి రాత్రి కడపకు బైకులో వస్తుండగా రామాంజనేయపురం వద్దకు రాగానే రాజంపేట వైపుకు వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మస్తాన, శ్రీకాంతల మృతిపై వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించడంతో బంధువులు, స్థానికులు పెద్దఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోధించారు. పోస్టుమార్టం కొరకు మృతదేహాలను రిమ్స్కు తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.