మత్తు ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే వైసీపీ నైజం
ABN , First Publish Date - 2021-10-28T03:36:06+05:30 IST
రాష్ట్రాన్ని మత్తు ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే వైసీపీ నైజం అని తెలుగు యువత రాష్ట్ర నాయకుడు బొక్కసం సునీల్ అన్నారు.
తెలుగు యువత రాష్ట్ర నాయకుడు బొక్కసం సునీల్
రైల్వేకోడూరు, అక్టోబరు 27: రాష్ట్రాన్ని మత్తు ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే వైసీపీ నైజం అని తెలుగు యువత రాష్ట్ర నాయకుడు బొక్కసం సునీల్ అన్నారు. బుధవారం రైల్వేకోడూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని, రాష్ట్ర యువత మత్తులో పడటంతో వారి భవిష్యత్తు అంధకారమయంగా మారుతోందన్నారు. రైల్వేకోడూరు నడిబొడ్డున గంజాయి విక్రయాలు సా గుతున్న విషయం రైల్వేకోడూరు ప్రజాప్రతినిధికి తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబును నార్కో అనాలసిస్ పరీక్షకు పంపాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలన్నారు.