రాచాయపేటలో రెండు వార్డులు ఏకగ్రీవం
ABN , First Publish Date - 2021-11-10T04:57:53+05:30 IST
మండలంలోని రాచాయపేటలో రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. రాచాయపేట పంచాయతీలో 1, 6 వా ర్డుల అభ్యర్థులు మృతిచెందడంతో అక్కడ ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టి నామినేషన్లు స్వీకరించారు.
![రాచాయపేటలో రెండు వార్డులు ఏకగ్రీవం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
గోపవరం, నవంబరు 9 : మండలంలోని రాచాయపేటలో రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. రాచాయపేట పంచాయతీలో 1, 6 వా ర్డుల అభ్యర్థులు మృతిచెందడంతో అక్కడ ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టి నామినేషన్లు స్వీకరించారు. ఈ రెండు వార్డులలో ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో నామినేషన్ల పరిశీలన అనంతరం 1వ వార్డుకు పఠాన్ గౌసియ, 6వ వార్డుకు తమ్మిశెట్టి వెంకటలక్ష్మిలను ఏకగ్రీవం చేసినట్లు రిటర్నింగ్ అధికారి గురవయ్య, ఎంపీడీఓ మోహన్ తెలిపారు.