శాంతికి చిహ్నం కరుణామయుడు

ABN , First Publish Date - 2021-12-26T05:06:57+05:30 IST

కరుణామయుడు యేసుక్రీ స్తు శాంతికి చిహ్నం అని, దయ, ప్రేమ, కరుణ కలిగిన వ్యక్తి అని ఆర్‌సీఎం ఫాదర్‌ మర్రెడ్డి, టీసీసీ చర్చి పాస్టర్‌ విజయశేఖర్‌, సీఎ్‌సఐ చర్చి పాస్టర్‌ భారత్‌హెరాల్డ్‌, పాస్టర్‌ ప్రభుదాసు తెలిపారు.

శాంతికి చిహ్నం కరుణామయుడు
టీసీసీ చర్చిలో ప్రార్థన చేస్తున్న సేవకుడు

కమలాపురం రూరల్‌, డిసెంబరు 25: కరుణామయుడు యేసుక్రీ స్తు శాంతికి చిహ్నం అని, దయ, ప్రేమ, కరుణ కలిగిన వ్యక్తి అని ఆర్‌సీఎం ఫాదర్‌ మర్రెడ్డి, టీసీసీ చర్చి పాస్టర్‌ విజయశేఖర్‌, సీఎ్‌సఐ చర్చి పాస్టర్‌ భారత్‌హెరాల్డ్‌, పాస్టర్‌ ప్రభుదాసు తెలిపారు. శనివారం క్రిస్మస్‌ పండుగ సందర్భంగా క్రీస్తు విశ్వాసులు  కొత్త దుస్తులు ధరించి సమీపంలోని చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చి పా స్టర్లు మాట్లాడుతూ యేసుక్రీస్తును ఆదర్శంగా తీసుకుని జీవించాలన్నారు. అనంతరం ఒకరికొకరు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సా ల్యం చర్చిలో పాస్టర్‌ ఆధ్వర్యంలో 20వ వార్డు కౌన్సిలర్‌ నీలం ప్రవీణ ముఖ్య అతిథిగా పా ల్గొని 80 మంది పేద, వృద్ధ మహిళలు, వితంతువులకు చీరలు, చిన్నారులకు దుస్తులు, బైబిళ్లు అందజేశారు. 

Updated Date - 2021-12-26T05:06:57+05:30 IST