పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి
ABN , First Publish Date - 2021-01-22T04:54:29+05:30 IST
పట్టణంలో సామాజిక సంన్కర్త దళిత బహుజనుల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి బాపూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బీసీ నేతలు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డిని కోరారు.
ప్రొద్దుటూరు అర్బన్, జనవరి 21 : పట్టణంలో సామాజిక సంన్కర్త దళిత బహుజనుల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి బాపూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బీసీ నేతలు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డిని కోరారు. ఆమేరకు ఎమ్మెల్యేను కలిసి వారొక వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా బీసీ నేత పూలే విగ్రహ కమిటీ కన్వీనర్ నాగమల్ల విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ కొన్నేళ్లుగా పూలే విగ్రహ ప్రతిష్ఠ కోసం స్థలాలు అన్వేషిస్తు అనుమతులు కోరుతూ వచ్చా మని అధికారుల అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తు న్నారన్నారు. ఇప్పటికైన పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అనుమతులు ఇప్పించాలని కోరగా ఆర్టీసి బస్టాండ్వద్ద అనుమతులు ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారన్నారు.