అమరవీరుల సేవలు చిరస్మరణీయం
ABN , First Publish Date - 2021-10-22T04:53:13+05:30 IST
దేశ రక్షణలో పోలీసు అ మరవీరుల సేవలు చిరస్మరణీయమని కమాండెంట్ శ్రీనివాసరావు అన్నారు.
కమాండెంట్ శ్రీనివాసరావు
సిద్దవటం, అక్టోబరు21: దేశ రక్షణలో పోలీసు అ మరవీరుల సేవలు చిరస్మరణీయమని కమాండెంట్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం సిద్దవటం మండల పరిధిలో ఉన్న 11వ బెటాలియన్లో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన కమాండెం ట్ తొలుత స్తూపానికి నివాళులర్పించి పోలీసు ల గౌరవవందనం స్వీకరించారు. అడిషనల్ క మాండెంట్ ప్రభుకుమార్ అమరులైన పోలీసుల పేర్లను చదివి వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసులే శాంతిభద్రతలకు ప్ర ధాన ఆ యుధమన్నారు. దేశంలో జరిగే అ న్ని ఆందోళనలు, అక్రమాలను కట్టడి చేసేందు కు పోలీసు వ్యవస్థ కీలకంగా పనిచేయాల్సి ఉం టుందన్నారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో పోలీసులు తమ ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తుందన్నారు. దేశ సంరక్షణ, అసాంఘిక శక్తులను ఎదుర్కోవడంలో భాగంగా వేల మంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఎటువంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమానికి హాజరైన పోలీ సు అమరవీరుల కుటుంబాలకు మెమొంటోల ను అందజేశారు. కొవిడ్ 19తో మరణించిన కు టుంబాలకు చెక్ను కమాండెంట్ చేతుల మీ దుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీడీఐ కమాండెంటు ప్రభుకుమార్, అసిస్టెంట్ కమాం డెంట్లు బి.వై.ఎం.రెడ్డి నాయక్, కె.వెంకటరెడ్డి, ఆర్ఐలు, ఆర్ఎ్సఐలు, ఏఆర్ఎ్సఐలు, పోలీసు అమరవీరుల కుటుంబాలు పాల్గొన్నారు.