ఘాట్లో అదుపు తప్పి లోయలో పడిన లారీ - డ్రైవర్ మృతి
ABN , First Publish Date - 2021-02-25T05:13:23+05:30 IST
గువ్వల చెరువు ఘాట్లో లారీ అదుపు తప్పి లోయలో పడటంతో ఏలుమలై (40) అనే డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్ఐ రాజరాజేశ్వర్రెడ్డి తెలిపారు.
సీకేదిన్నె, ఫిబ్రవరి 24: గువ్వల చెరువు ఘాట్లో లారీ అదుపు తప్పి లోయలో పడటంతో ఏలుమలై (40) అనే డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్ఐ రాజరాజేశ్వర్రెడ్డి తెలిపారు. తమిళనాడు రాష్ట్రం తుత్తుకుడి నుంచి సాల్ట్ ప్యాకెట్లు తీసుకుని ఆళ్లగడ్డకు వస్తుండగా గువ్వలచెరువు ఘాట్ దిగుతూ అదుపు తప్పి మూడవ మలుపు వద్ద లోయలో పడింది. ఈ ప్రమాదంలో క్యాబిన్లో ఉన్న ఏలుమలై మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.